యస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో.. ఎస్​బీఐ వాటా అమ్మకం

యస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో.. ఎస్​బీఐ వాటా అమ్మకం
  • డీల్​ విలువ రూ.8,889 కోట్లు

న్యూఢిల్లీ: ప్రైవేట్​ రంగానికి చెందిన యస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో 13.19 శాతం వాటాను జపాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్​ఎంబీసీ)కు రూ.8,889 కోట్లకు విక్రయించడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) శుక్రవారం ప్రకటించింది. 

ఈ సమావేశంలో బ్యాంక్ సెంట్రల్ బోర్డు  ఎగ్జిక్యూటివ్ కమిటీ యస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో 13.19 శాతం వాటాకు సమానమైన 413.44 కోట్ల షేర్లను రూ.8,888.97 కోట్లకు విక్రయించడానికి ఆమోదం తెలిపిందని ఎస్​బీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో తెలిపింది.