బెంగాల్ లో వన్ నేషన్-వన్ రేషన్ పథకం అమలు చేయాలి 

బెంగాల్ లో వన్ నేషన్-వన్ రేషన్ పథకం అమలు చేయాలి 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్-వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది.
ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి ఎలాంటి సాకులు చూపకుండా.. వెంటనే అమలు చేయాలని తెలిపింది సుప్రీం. ఈ పథకం వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిందని.. అమ‌లుకు స‌మ‌స్య‌ల‌ను వెత‌క‌కుండా వెంట‌నే ఈ పథకాన్ని అమలు చేయాల‌ని బెంగాల్ ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం చేసింది సుప్రీం కోర్టు.