
ఎస్సీ, ఎస్టీ స్కాలర్లు ఐఐటీల్లో అంతంతే
న్యూఢిల్లీ: ఐఐటీల్లో పీహెచ్డీ చేస్తున్న ఎస్సీ, ఎస్టీల సంఖ్య తక్కువని, రిజర్వేషన్ కోటా కూడా పూర్తి కావడంలేదని అధికారిక డాటా ఒకటి వెల్లడించింది. పీహెచ్డీ కోర్సుల్లో చేరే ఎస్సీ, ఎస్టీలు అతికొద్దిమందేనని చెప్పింది. 2015 నుంచి 2019 మధ్య కాలంలో దేశంలోని 23 ఐఐటీల్లో 25,007 మంది పీహెచ్డీ స్కాలర్లు చేరితే .. వీరిలో ఎస్సీలు 9.1% మంది, ఎస్టీలు 2.1% మంది ఉన్నారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఉన్నా ఆ మేరకు ఈ వర్గాలు ఐఐటీల్లో పీహెచ్డీకి ఎన్రోల్కావడంలేదని రాజ్యసభలో సర్కార్ డేటాను వెల్లడించింది. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతుండగా 23.2% మంది డాక్టొరల్ లెవల్ కోర్సులో చేరారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం 65.6% పీహెచ్డీ కోర్సుల్లో చేరారు.