హైదరాబాద్: రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ద్రోణి విదర్భ నుండి తెలంగాణ మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటుసముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో ( గాలి వేగం గంటకు 30 నుండి40 కి మీ వేగంతో ) కూడిన వర్షములు రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి
మోడీ నిజాలు చెప్పరు.. చెప్పనివ్వరు!
ఏడేళ్ల బీజేపీ పాలనలో ధరలు పెరిగాయి