
పటాన్ చెరు, వెలుగు: ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్లు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒకవైపు ట్రాఫిక్ పోలీస్ లు తనిఖీలు చేస్తున్నా.. స్కూల్ బస్సు డ్రైవర్లు లెక్క చేయడం లేదు. స్కూల్ యాజమాన్యం డ్రైవర్ల పై నిఘా పెట్టడం లేదు. ఫలితంగా పిల్లల ప్రమాదాలకు కారణమవుతున్నారు. బుధవారం సాయంత్రం పటాన్ చెరు ట్రాఫిక్ , ఎంవీఐ అధికారులు సంయుక్తంగా నవపాన్ ఎక్స్ రోడ్ వద్ద డ్రంకెన్డ్రైవ్తనిఖీలు నిర్వహించారు. కర్దానూర్ గ్రామంలోని జీసస్ మేరీ హై స్కూల్ కు చెందిన బస్సు డ్రైవర్మద్యం తాగి బస్సు నడుపుతూ పట్టుబడ్డాడు. అధికారులు బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దీంతో బస్సును సీజ్ చేసి, డ్రైవర్ గోపాల్ ను అదుపులో తీసుకున్నారు. కోర్టుకు తరలించనున్నట్టు ట్రాఫిక్ సీఐ తెలిపారు. సాయిరాం, గీత స్కూల్ కు సంబంధించిన బస్సులు ఫిట్నెస్ పత్రాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. తనిఖీల్లో ట్రాఫిక్ సీఐ వేణు కుమార్, రాజ్ మహమద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.