వట్ పల్లిలో స్కూల్ బస్సు బోల్తా పడి 16మంది చిన్నారులకు గాయాలు

వట్ పల్లిలో స్కూల్ బస్సు బోల్తా పడి 16మంది చిన్నారులకు గాయాలు

16మంది చిన్నారులకు గాయాలు

పరారీలో డ్రైవర్

వట్ పల్లి, వెలుగు: స్కూల్ బస్సు బోల్తా పడి 16మంది చిన్నారులకు గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా వట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం బిజిలిపూర్ వద్ద జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. జోగిపేట్ పట్టణానికి చెందిన ఆక్స్‌‌‌‌‌‌‌‌ఫర్డ్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ బస్సు సోమవారం గ్రామాల నుంచి పిల్లలను తీసుకొని స్కూల్​కు బయలుదేరింది. బీజిలిపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామ సమీపంలోకి రాగానే బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. దీంతో బస్సులోని 16 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. సమీపంలోని ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారులను ప్రథమ చికిత్స చేసి, సంగారెడ్డి అసుపత్రికి తరలించారు. వట్‌‌‌‌‌‌‌‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

డ్రైవర్.. కల్లు తాగాడా?

బస్సు బోల్తా పడగానే డ్రైవర్ పరారయ్యాడు. అయితే డ్రైవర్ కల్లు తాగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. గ్రామాల్లో తిరుగుతుండగా.. ఉదయం దొరికే కల్లు సేవించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ తో పాటు స్కూల్ సిబ్బందిపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.