న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లనూ ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ కిందకి తెచ్చినట్లు సెబీ ప్రకటించింది. ఇందుకోసం ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ను సవరించినట్లు వెల్లడించింది. లిస్టెడ్ కంపెనీల షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు మాత్రమే ఇప్పటిదాకా ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ అమలు చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ల యూనిట్లను ఇప్పటిదాకా సెక్యూరిటీస్ డెఫినిషన్ పరిధిలోకి తేలేదు.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం నేపథ్యంలో తాజాగా మ్యూచువల్ పండ్లను కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ రూల్స్ పరిధిలోకి తెచ్చారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్లోని కొంత మంది సీనియర్ ఉద్యోగులు తమకున్న ముందస్తు సమాచారంతో యూనిట్లను రిడీమ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పబ్లిష్ కాని ముందస్తు సమాచారం ఏదైనా అందుబాటులో ఉన్న వ్యక్తులు మ్యూచువల్ ఫండ్ స్కీముల యూనిట్లలో ట్రేడింగ్ చేయడానికి వీలు లేదని సెబీ కొత్త రూల్స్ తెచ్చింది.
తన మ్యూచువల్ ఫండ్ స్కీములలో ఉన్న యూనిట్ల వివరాలను ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తాజా రూల్స్ కింద స్టాక్ ఎక్స్చేంజీల ప్లాట్ఫామ్పై వెల్లడి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలలోని ఉద్యోగుల కోసం కోడ్ ఆఫ్ కాండక్ట్నూ ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ను సెబీ నవంబర్ 24 నుంచి అమలులోకి తెచ్చింది.