రూమర్లపై కొత్త రూల్​ అమలు వాయిదా.. సెబీ ప్రకటన

రూమర్లపై కొత్త రూల్​ అమలు వాయిదా.. సెబీ ప్రకటన

న్యూఢిల్లీ: మార్కెట్లో వచ్చే రూమర్లపై లిస్టెడ్​ కంపెనీలు 24 గంటల్లోపు స్పందించాలనే కొత్త రూల్ అమలును వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు సెబీ వాయిదా వేసింది. మార్కెట్​ విలువ పరంగా టాప్​ 100  లిస్టెడ్​ కంపెనీలకు  ఈ నెల 1 నుంచే ఈ రూల్​ను అమలులోకి తేవాలని సెబీ గతంలో నిర్ణయించింది.

లిస్టెడ్​ కంపెనీలలో కార్పొరేట్​ గవర్నెన్స్​ను మరింత పెంచాలనేదే ఈ రూల్​ టార్గెట్​. మార్కెట్​ వాల్యూ ప్రకారం  టాప్​ 250 లిస్టెడ్​  కంపెనీలకు ఈ కొత్త రూల్​ను ఆగస్టు 1, 2024 నుంచి అమలులోకి తేనున్నట్లు సెబీ తాజాగా వెల్లడించింది.