
న్యూఢిల్లీ: మార్కెట్లో వచ్చే రూమర్లపై లిస్టెడ్ కంపెనీలు 24 గంటల్లోపు స్పందించాలనే కొత్త రూల్ అమలును వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వరకు సెబీ వాయిదా వేసింది. మార్కెట్ విలువ పరంగా టాప్ 100 లిస్టెడ్ కంపెనీలకు ఈ నెల 1 నుంచే ఈ రూల్ను అమలులోకి తేవాలని సెబీ గతంలో నిర్ణయించింది.
లిస్టెడ్ కంపెనీలలో కార్పొరేట్ గవర్నెన్స్ను మరింత పెంచాలనేదే ఈ రూల్ టార్గెట్. మార్కెట్ వాల్యూ ప్రకారం టాప్ 250 లిస్టెడ్ కంపెనీలకు ఈ కొత్త రూల్ను ఆగస్టు 1, 2024 నుంచి అమలులోకి తేనున్నట్లు సెబీ తాజాగా వెల్లడించింది.