బాప్ ఆఫ్ చార్ట్‌‌కు సెబీ షాక్‌‌

బాప్ ఆఫ్ చార్ట్‌‌కు  సెబీ షాక్‌‌

న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా స్టాక్స్ రికమండ్‌‌ చేస్తున్న  బాప్‌‌ ఆఫ్​ చార్ట్‌‌ యూటూబ్‌‌ ఛానెల్ నిర్వహించే మహ్మద్‌‌ నసీరుద్దీన్ అన్సారీకి  సెబీ భారీ షాక్ ఇచ్చింది. రూ.17.20 కోట్లు ఎస్క్రో అకౌంట్‌‌లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి ఆర్డర్లు ఇచ్చేంత వరకు మార్కెట్‌‌లో అడుగుపెట్టకుండా చేసింది.  ఇన్వెస్టర్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక ఆర్డర్స్‌‌ను ఇచ్చామని సెబీ వెల్లడించింది. 

‘ మహ్మద్ నసీరుద్దీన్​ అన్సారీ, రాహుల్ రావు పడమటి, గోల్డెన్‌‌ సిండికేట్‌‌ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌లు మార్కెట్‌‌లో ఎటువంటి షేర్లను డైరెక్ట్‌‌గా లేదా ఇన్‌‌డైరెక్ట్‌‌గా తదుపరి ఆర్డర్ ఇచ్చేంత వరకు  కొనకుండా, అమ్మకుండా చేస్తున్నాం.  వీరికి  ఎఫ్ అండ్ ఓ లో ఎటువంటి ఓపెన్ పొజిషన్లు ఉన్నా అవి ఆర్డర్‌‌‌‌ ఇచ్చినప్పటి నుంచి మూడు నెలల్లో స్క్వేర్ ఆఫ్ అవుతాయి. మార్కెట్‌లో వీరు చెల్లించాల్సిన అమౌంట్‌‌ను సెటిల్ చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నాం ’ అని సెబీ వివరించింది. ఇన్వెస్ట్‌‌మెంట్ అడ్వైజరీ సర్వీస్‌‌ల ద్వారా గత రెండేళ్లలో రూ.17.2 కోట్లు సంపాదించారని, వీటిని రిఫండ్ చేయాలని ఆదేశించింది.