మార్కెట్​లో పాత కార్ల హల్​చల్​

మార్కెట్​లో పాత కార్ల హల్​చల్​

2027 నాటికి ఏటా 80 లక్షలకు

వెలుగు బిజినెస్​ డెస్క్​: సెకండ్​ హ్యాండ్​ కార్ల అమ్మకాలు 2027 నాటికి డబుల్ అవుతాయని అంచనా. ఈ సేల్స్​ 80 లక్షల యూనిట్లకు చేరతాయని భావిస్తున్నారు. కరోనా తర్వాత ప్రజలు సొంత వాహనాలు వాడటానికే ఎక్కువ ఇష్టపడుతుండటమే దీనికి కారణమని అంటున్నారు. సెకండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్ చాలా వరకు అన్​ఆర్గనైజ్డ్​గానే ఉండేది. ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​ రాకతో ఈ పరిస్థితి మారి, ట్రాన్సపరన్సీ పెరిగింది. ఫలితంగా సెకండ్​ హ్యాండ్​ కార్ల కొనుగోలు మరింత సులభంగా మారిందని ఎనలిస్టులు చెబుతున్నారు. 

వెంటనే కావాలంటే  ఈ రూటే బెస్ట్​....

రామక్రిష్ణ దేశిరాజు ముంబైలో ఒక అడ్వర్టైజ్​మెంట్​ ప్రొఫెషనల్​. స్పోర్ట్స్​ యుటిలిటీ వెహికల్​ కొనాలనేది ఆయన ఆలోచన. ఇందుకోసం రిసెర్చ్​ చేస్తుంటే, తాను కావాలనుకునే రూ. 20 లక్షల విలువైన  కొత్త కారు డెలివరీ కోసం ఆరు నుంచి 9 నెలలు వెయిట్​ చేయాల్సి ఉంటుందని ఆయన తెలుసుకున్నారు.  రకరకాల మోడల్స్​ చూసిన తర్వాత యూజ్డ్​ కార్​ షోరూమ్​ నుంచి రామక్రిష్ణ మహీంద్రా ఎక్స్​యూవీ 500 వేరియంట్​ను రూ. 12.5 లక్షలకు కొనుగోలు చేశారు.  నేను కారు వెంటనే కావాలనుకున్నాను. కరోనా వైరస్​వల్ల అంతకు ముందు కంటే కొంత జాగ్రత్తగా ఉండాలని ఆలోచించాను.

వీకెండ్​ ట్రిప్​లకు, పెట్స్​ తీసుకెళ్లడానికి సరిపోయేలా ఒక వెహికల్​ను నేను కావాలనుకున్నాను. ఎక్స్​యూవీ 500 ఈ అవసరాలకు సరిగ్గా సరిపోయిందని రామక్రిష్ణ చెప్పారు. మరో ముంబై బిజినెస్​ మేన్​ సచిన్​ మాయేకర్​ తన భార్య కోసం పెద్ద సెడాన్​ కొందామనుకున్నారు. కొత్తదైతే రూ. 25–28 లక్షలవుతుందని, 2014 మోడల్ హ్యుందాయ్​ ఎలంట్రా సెకండ్​ హ్యాండ్​ కారును రూ. 6.5 లక్షలకు కొన్నారు. కొత్త వెహికల్​కైతే రూ. 4 లక్షలు డౌన్​పేమెంట్​తోపాటు, ఆర్​టీవో రిజిస్ట్రేషన్​ ఖర్చులు, ట్యాక్సులు, ఇన్సూరెన్స్​ అన్నీ కలిపి తడిసిమోపెడవుతుంది. అందుకే ఈ సెకండ్​ హ్యాండ్​ కారు కొనడం జాక్​పాట్​గా భావిస్తున్నానని సచిన్​ మాయేకర్​ పేర్కొన్నారు.  మంచి కండిషన్​తోపాటు, తక్కువ దూరమే తిరిగిన సెకండ్​ హ్యాండ్​ కారు దొరికితే మంచి డీల్​ అవుతుందని మాయేకర్​ చెప్పారు. కరోనాకి ముందు నుంచే దేశంలో సెకండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్​ పుంజుకుంటోంది.

ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్స్​ జోరు...

కరోనా టైములో పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ కాదనుకుని, షేర్డ్​ రైడ్స్​కు పెద్ద పీట వేయడం మొదలైంది. ఆ తర్వాత కొత్తదో, పాతదో సొంత వెహికల్స్​ కొనుక్కోవడం ఎక్కువైందని ఐబీబీ రిపోర్టు తయారు చేసిన అశుతోష్​ పాండే చెప్పారు. యూజ్డ్​ కార్ల బిజినెస్​లోని మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​కు అశుతోష్​ పాండే ఎండీ ఉన్నారు. ఈ కంపెనీ 2021 లో 1.8 లక్షల కార్ల అమ్మకాలను ఫెసిలిటేట్​ చేసింది. 2023 నాటికి ఈ సంఖ్య 2.5 లక్షలకు చేరుతుందని ఆయన చెప్పారు. 2027 నాటికి ఏటా 8 లక్షల సెకండ్​ హ్యాండ్​ కార్ల అమ్మకాలను ఫెసిలిటేట్ చేయాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. తమ నెలవారీ అమ్మకాలలో ఎస్​యూవీల వాటా 18 శాతమని చెప్పారు. 

కరోనాతో మార్కెట్​కు బూస్ట్​..

కరోనా తర్వాత ఆటో సేల్స్‌​కు మరింత బూస్ట్​ వచ్చింది. ఇంటర్​నెట్​ బాగా విస్తరించడంతో ఆన్​లైన్​ రిటెయిల్​ ప్లేయర్ల సంఖ్య పెరిగింది. వారి పట్ల కస్టమర్లకు నమ్మకం కూడా కుదురుతోంది. కస్టమర్లకు బెటర్​ డీల్స్​తోపాటు, బెనిఫిట్స్​నూ ఈ ఆన్​లైన్​ కంపెనీలు ఆఫర్​ చేస్తున్నాయి. 2022లో  మన దేశంలో  సెకండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్​ 44 లక్షల యూనిట్ల దాకా ఉంది. ఇది  6 శాతం  పెరిగి 2023లో 46 లక్షల యూనిట్లకు చేరుతుందని అంచనా. ఇండియన్​ బ్లూబుక్ (ఐబీబీ) ఈ రిపోర్టును రిలీజ్​ చేసింది. 2027 నాటికి ఇండియాలో సెకండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్​ 80 లక్షల యూనిట్లకు చేరుతుందని, ప్రస్తుతం విలువ పరంగా సెకండ్​ హ్యాండ్​ కార్ల మార్కెట్​  23 బిలియన్​ డాలర్లని కూడా ఈ రిపోర్టు తయారు చేసిన మహీంద్రా ఫస్ట్​ ఛాయిస్​ లిమిటెడ్​ పేర్కొంది.  రాబోయే ఏళ్లలో ఈ మార్కెట్​ ఏటా 19.5 శాతం చొప్పున పెరుగు తుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది.