వైఎస్‌ షర్మిలకు భద్రత పెంపు

 వైఎస్‌ షర్మిలకు  భద్రత  పెంపు

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిలకు భద్రత పెంచారు పోలీసులు.  ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఓ ప్రకటన విడుదల చేశారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూ గా భద్రత పెంచినట్లుగా తెలిపారు.  రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో భద్రత పెంచినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇటీవలే తనకు భద్రత కల్పించాలని కోరుతూ షర్మిల డీజీపీకి లేఖ రాశారు. ఈ క్రమంలో డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు .  ఎన్నికల సమయంలో ఎవరైనా కోరితే భద్రత కల్పిస్తామని ఆయన వెల్లడించారు.