ఇప్పుడు నేను ఇండియన్‌ను.. ఇండియాకు వచ్చిన పాకిస్తానీ సీమా హైదర్

ఇప్పుడు నేను ఇండియన్‌ను.. ఇండియాకు వచ్చిన పాకిస్తానీ సీమా హైదర్

న్యూఢిల్లీ: పబ్‌జీ’ గేమ్‌ ద్వారా పరిచయమైన భారత కుర్రాడితో ప్రేమలో పడి సరిహద్దులు దాటి వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్ బెయిల్‌పై విడుదలైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు తాను కూడా భారతీయురాలినేనని చెప్పింది. ‘‘మా ఆయన హిందువు. కాబట్టి నేను కూడా హిందువునే. నాది ఇప్పుడు ఇండియానే” అని చెప్పుకొచ్చింది. పెండ్లి అయ్యి, నలుగురు పిల్లలున్న ఆమె.. నేపాల్ మీదుగా గ్రేటర్ నోయిడాలోని ప్రియుడు సచిన్ మీనా వద్దకు చేరుకుంది.

వీసా లేకుండా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించిన ఆమెను ఈ నెల 4న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్‌ను కూడా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై వీరు విడుదలయ్యారు. తనను రిలీజ్ చేయగానే సంతోషంతో గట్టిగా అరిచానని సీమ చెప్పింది. గత మార్చిలోనే నేపాల్‌లో సచిన్, సీమా పెండ్లి చేసుకున్నారు. మరోవైపు దేశంలో అధికారికంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె భావిస్తోంది.