న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలి మెడల్ టార్గెట్గా స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నేతృత్వంలో ఇండియా టీమ్ బరిలోకి దిగనుంది. మే 14 నుంచి 21 వరకు చైనాలోని సుజౌలో జరిగే ఈ మెగా టోర్నీకి సీనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ బుధవారం టీమ్ను ప్రకటించింది. గాయం వల్ల ఆసియా మిక్స్డ్ టీమ్ ఈవెంట్కు దూరంగా ఉన్న డబుల్స్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ టీమ్లోకి తిరిగొచ్చాడు. ఇండియా గ్రూప్–సిలో మలేసియా, చైనీస్ తైపీ, ఆస్ట్రేలియాతో కలిసి బరిలోకి దిగనుంది.
ఇండియా టీమ్:
మెన్స్ సింగిల్స్: ప్రణయ్, శ్రీకాంత్ (రిజర్వ్: లక్ష్య సేన్); విమెన్స్ సింగిల్స్: పీవీ సింధు, అనుపమ (రిజర్వ్: ఆకర్షి); మెన్స్ డబుల్స్: సాత్విక్–చిరాగ్, అర్జున్–ధృవ్;
విమెన్స్ డబుల్స్: గాయత్రి–ట్రీసా, అశ్విని–తనీషా; మిక్స్డ్ డబుల్స్: తనీషా–ప్రతీక్..