
- తహసీల్దార్ ఆఫీస్ ముందు ప్రజల పడిగాపులు
సిద్దిపేట రూరల్, వెలుగు: భూ భారతి సర్వర్ నిలిచిపోవడంతో భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజులుగా సిద్దిపేట రూరల్ తహసీల్దార్ఆఫీసు లో సర్వర్నిలిచిపోవడంతో రోజుకు ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి.
దీంతో మండల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసు వద్ద వేచి చూస్తూ అవస్థ పడుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా కొద్ది రోజులుగా సర్వర్ సరిగ్గా పని చేయడంలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు.