జీసీసీ లీడర్లకూ హైదరాబాదే అడ్డా.. బెంగళూరులోనూ భారీగానే: వెల్లడించిన క్వెస్ స్టడీ రిపోర్ట్

జీసీసీ లీడర్లకూ హైదరాబాదే అడ్డా.. బెంగళూరులోనూ భారీగానే: వెల్లడించిన క్వెస్ స్టడీ రిపోర్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీలు) సీనియర్​ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు​, లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ పొజిషన్లలోని వారు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనే ఎక్కువగా ఉన్నారని వెల్లడయింది.  భారతదేశంలోని మొత్తం జీసీసీ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థానాల్లో ఈ రెండు నగరాలు వాటా దాదాపు 70 శాతం ఉందని క్వెస్ కార్ప్ రిపోర్ట్​ వెల్లడించింది. దీని ప్రకారం.. హైదరాబాద్​లో నియామకాల వృద్ధి​ వార్షికంగా 42 శాతం పెరిగింది.  బెంగళూరు ట్యాలెంట్​ హబ్​గా ఎదిగింది. 

ఇది మార్కెట్ సగటు కంటే 8-–10 శాతం ఎక్కువ.  ఫైనాన్స్​, రిస్క్ సంబంధిత పనులకు చెన్నై అడ్డాగా ఉందని తెలిపింది.  పూణే అనలిటిక్స్, నాణ్యత హామీలో బలాన్ని పెంచుకుంటోంది. కోచి, కోయంబత్తూరు లాంటి టైర్ 2 నగరాలు సహాయక కేంద్రాలుగా మారుతున్నాయి. జీసీసీలకు జనరేటివ్ ఏఐ, ఎల్ఎల్ఎం ఇంజనీరింగ్ వంటి కొత్త టెక్నాలజీల ఎక్స్​పర్టులు దొరకడం కష్టంగా మారింది. 

దీనివల్ల కీలకమైన స్థానాలు భర్తీ కావడానికి 90 నుంచి 120 రోజులు పడుతోంది. జీసీసీలు ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య పెంపు కంటే ఏఐ, క్లౌడ్  వంటి కీలక రంగాల్లో సామర్థ్యం సృష్టించడంపై దృష్టి పెడుతున్నాయని క్వెస్ ​తెలిపింది.