హైదరాబాద్, వెలుగు: స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ (ఎస్జీఎల్టీఎల్) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలలు, రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ పేరును స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్గా మారుస్తున్నట్లు బోర్డు తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో (హెచ్1) మొత్తం ఆదాయం రూ. 366 కోట్లు, ఇబిటా రూ. 69 కోట్లు, నికర లాభం రూ. 42 కోట్లుగా ఉంది. రెండో క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ. 188 కోట్లు, ఇబిటా రూ. 34 కోట్లు, నికరలాభం రూ. 20 కోట్లు వచ్చింది. గ్లోబల్ షిప్పింగ్ ఆలస్యం కారణంగా రూ. 40-–45 కోట్ల ఎగుమతి డిస్పాచ్లు వాయిదా పడ్డాయి.
