రెండ్నెళ్లు కష్టపడి.. షారుఖ్​ ఖాన్​​ మైనపు బొమ్మ తయారు చేసిన అభిమాని

రెండ్నెళ్లు కష్టపడి.. షారుఖ్​ ఖాన్​​ మైనపు బొమ్మ  తయారు చేసిన అభిమాని

పఠాన్​ సినిమా బ్లాక్​ బాస్టర్​తో మాంచి ఊపు మీదున్న బాలీవుడ్​ స్టార్​ హీరో షారుఖ్​ఖాన్​ వరుస బెట్టి సినిమాలు తీస్తూ ఉన్నాడు. కాగా పఠాన్​ హిట్​అవడంతో ఆయన అభిమాని ఒకరు షారుఖ్​ మైనపు బొమ్మను తయారు చేశాడు. పశ్చిమబెంగాల్ లోని అసన్​పోల్​కు చెందిన కళాకారుడు సుశాంత్​రాయ్​రెండు నెలల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని రూపొందించారు.

పఠాన్​ హిట్​ కావడంతో..

పఠాన్​ హిట్​కావడంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరికి భిన్నంగా ఏదైనా చేయాలని అనుకుని షారుఖ్​ మైనపు బొమ్మను తయారు చేశాడు.  ప్రస్తుతం ఈ విగ్రహం అసన్ సోల్​లోని ప్రైవేటు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. షారుఖ్​ని కలిసినప్పుడు ఈ విగ్రహాన్ని కానుకగా ఇవ్వాలనుందని సుశాంత్​ రాయ్​ తెలిపారు. 

ఇటీవల విడుదలైన పఠాన్​ ప్రపంచవ్యాప్తంగా షారుఖ్​ కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమాలో షారుఖ్​ సరసన బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొనే నటించింది.