కోహ్లీ ఆట తీరుపై అసహనం

కోహ్లీ ఆట తీరుపై అసహనం

కోహ్లీ ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహీద్ అఫ్రిది.  అతడికి మునపటిలాగా  రాణించలనే ఉద్దేశం ఉందా లేదా అంటూ ప్రశ్నించాడు. క్రికెట్ లో ఎవరికైనా తమ ఆట పట్ల కచ్చితమైన ఆలోచన దృక్పధం ఉండాలి. కోహ్లీకి ఇప్పుడు అలాంటి యాటిట్యూడ్ ఉందా? లేదా?  అన్నది తెలియాలి. కోహ్లీ మళ్లీ క్రికెట్ లో నంబర్ వన్  ఆటగాడు కావాలనుకుంటున్నాడా లేదా ఇప్పటివరకు సాధించిన దానితో సంతృప్తి చెందాడా అని ఈ పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు చేశాడు. కాగా కోహ్లీ గడిచిన రెండున్నర ఏళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అటు గత ఐపీఎల్ లో కూడా అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఐపీఎల్ 2022లో 3 అర్ధసెంచరీలతో 341 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ మొత్తం టోర్నీలో మూడు గోల్డెన్ డక్‌లు కూడా సాధించాడు.