హైదరాబాద్, వెలుగు: వింగ్స్ ఇండియా 2026 వేదికగా శక్తి ఏవియేషన్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ (ఎస్ఏడీఎస్పీఎల్), ఓమ్నిపోల్ గ్రూప్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. 19 సీట్ల సామర్థ్యం ఉన్న ఎల్ 410 ఎన్జీ విమానాలను భారత్లో తయారు చేయడానికి ఇరు సంస్థలు చేతులు కలిపాయి.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. దేశీయంగా విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు టెక్నాలజీని బదిలీ చేసుకుంటాయి. తక్కువ దూరం ఉన్న రన్వేలపై నుంచి కూడా ఈ విమానాలు టేకాఫ్ అవ్వగలవు. మారుమూల ప్రాంతాలకు విమాన సేవలు అందించడంలో ఇవి సాయడపతాయి.
