
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో పదేండ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంజయ్ పరాహు(25) అలియాస్ ఇర్ఫాన్ హుస్సేన్ కర్నాటకలో కొన్ని రోజులు లేబర్ గా పని చేశాడు. సోమవారం శంషాబాద్ వచ్చాడు. బెంగళూరు జాతీయ రహదారి ఫ్లైఓవర్ కింద ఏపీలోని తిరుపతికి చెందిన ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారు దొరికిన పని చేసుకుంటూ లేకపోతే భిక్షాటన చేస్తూ బతుకుతున్నారు. అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న సంజయ్..బాలిక తల్లిదండ్రులతో మాటలు కలిపాడు. వారు నిద్రలోకి జారుకున్నాక బాలికను పక్కనే ఉన్న ఓ హోటల్ లోని రూమ్కు తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు.
అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలు తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పడంతో వారు ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ బాలరాజు తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి, 2, 3 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్చేశారు. అనంతరం అతన్ని సంఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. సంజయ్పై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించిన ఇన్స్పెక్టర్పేర్కొన్నారు.