వలస కూలీలను పంపడంపై సీఎంలతో మాట్లాడండి

వలస కూలీలను పంపడంపై సీఎంలతో మాట్లాడండి

ప్రధాని మోదీకి పవార్ అభ్యర్థన
ముంబై: వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపడంపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కోరారు. ‘వలస కూలీలను వారి స్వస్థలాలకు తెప్పించే విషయంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నా. ఎవరైతే వలస కూలీలను వెళ్లనివ్వడం లేదో ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని చర్చలు జరపాలి’ అని పవార్ ట్వీట్ చేశారు.

ఇదే విషయంపై రైల్వేస్ మినిస్టర్ పీయూష్ గోయల్ తోపాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోనూ ఫోన్ లో పవార్ మాట్లాడారు. తమ రాష్ట్రానికి రావాలని ఎదురు చూస్తున్న కార్మికుల కోసం ట్రాన్స్ పోర్టేషన్ ఏర్పాటు చేస్తానని సీఎం ఠాక్రే హామీ ఇచ్చారన్నారు. అందుకు స్టేట్ ట్రాన్స్ పోర్ట్ బస్సులను యూజ్ చేసుకుంటామని ఉద్ధవ్ అన్నారని పవార్ తెలిపారు.