చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్‌‌..ఈ కంపెనీల షేర్లలో ఫుల్ జోష్‌‌

చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్‌‌..ఈ కంపెనీల షేర్లలో ఫుల్ జోష్‌‌

గురువారం 12 % వరకు ర్యాలీ చేసిన స్పేస్ రిలేటెడ్‌‌  కంపెనీల షేర్లు
లాంగ్ టెర్మ్‌‌లో మరింత పెరుగుతాయని చెబుతున్న ఎనలిస్టులు
ఎల్‌‌ అండ్ టీ, హెచ్‌‌ఏఎల్‌‌, ఎంటీఏఆర్‌‌‌‌ టాప్‌‌ పిక్స్‌‌

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ కావడంతో ఈ మిషన్‌‌లో పాలుపంచుకున్న కంపెనీల షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. బుధవారం సెషన్‌‌లో 14 శాతం వరకు పెరిగిన ఇండియన్ స్పేస్ రిలేటెడ్‌‌ కంపెనీల షేర్లు, గురువారం మరో 12 శాతం వరకు పెరిగాయి.  ఇస్రో  సన్‌‌ మిషన్‌‌ ఆదిత్య1 వంటి ప్రాజెక్ట్‌‌లు పైప్‌‌లైన్‌‌లో ఉండడంతో ఈ కంపెనీల ఫ్యూచర్ మెరుగ్గా ఉంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. 

చంద్రయాన్ 3 మిషన్‌‌లో భాగం పంచుకున్న కంపెనీలు ఇవే..

1) పారస్‌‌ డిఫెన్స్‌‌ అండ్ స్పేస్ టెక్నాలజీస్‌‌

డిఫెన్స్ అండ్‌‌ స్పేస్‌‌ ఆప్టిక్స్‌‌, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్‌‌, హెవీ ఇంజినీరింగ్ వంటి సెగ్మెంట్‌‌లలో ఈ కంపెనీ బిజినెస్ చేస్తోంది. చంద్రయాన్3 మిషన్‌‌కు నావిగేషన్ సిస్టమ్‌‌ను సప్లయ్ చేసింది. బుధవారం సెషన్‌‌లో 5 శాతం పెరిగిన కంపెనీ షేర్లు గురువారం సెషన్‌‌లో మరో 12 శాతం వరకు ర్యాలీ చేసి రూ.842 దగ్గర ఏడాది గరిష్టాన్ని టచ్‌‌ చేశాయి. చివరికి  7 శాతం లాభంతో రూ.770 దగ్గర సెటిలయ్యాయి. 

2) ఎంటీఏఆర్‌‌‌‌ టెక్నాలజీస్‌‌

హైదరాబాద్‌‌ కంపెనీ ఎంటీఏఆర్ టెక్నాలజీస్‌‌  వికాస్ ఇంజిన్స్‌‌, క్రైజెనిక్‌‌ ఇంజిన్‌‌ సబ్‌‌సిస్టమ్స్‌‌, టర్బో పంప్‌‌, బూస్టర్ పంప్‌‌ వంటి విడిభాగాలను ఇస్రోకి సప్లయ్ చేసింది. మంగళయాన్‌‌ మిషన్‌‌ టైమ్‌‌లో కూడా పీఎస్‌‌ఎల్‌‌వీ  సీ25 రాకెట్‌‌కు ఇంజిన్‌‌ను సప్లయ్ చేసింది. బుధవారం సెషన్‌‌లో  5 శాతం పెరిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ షేర్లు గురువారం మరో 8 శాతం  వరకు పెరిగాయి. చివరికి 4 శాతం లాభంతో రూ.2,311 దగ్గర సెషన్‌‌ ముగించాయి. 

3) హిందుస్తాన్‌‌ ఏరోనాటిక్స్‌‌ (హెచ్‌‌ఏఎల్‌‌)

ప్రభుత్వ రంగ కంపెనీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ చంద్రయాన్ 3 మిషన్‌‌ కోసం మెకానికాల్‌‌ హార్డవేర్ పార్టులను సప్లయ్ చేసింది. బుధవారం 3.6 శాతం పెరిగిన హెచ్‌‌ఏఎల్ షేర్లు గురువారం ఇంట్రాడేలో  ఒక శాతం పెరిగాయి. చివరికి ఓపెనింగ్ లాభాలు కోల్పోయి 1.52 శాతం లాస్‌‌తో రూ.3,970 వద్ద సెటిలయ్యాయి. 

4) మిశ్ర ధాతు నిగమ్‌‌..

హైదరాబాద్‌‌ బేస్డ్‌‌ ప్రభుత్వ రంగ కంపెనీ మిశ్ర ధాతు నిగమ్‌‌  లిమిటెడ్‌‌  కోబల్ట్‌‌ ఆల్లాయ్స్‌‌ (అల్లాయ్స్‌‌ అంటే వేరువేరు మెటల్స్‌‌తో కలిపి చేసిన మరో మెటల్‌‌) , నికెల్ అల్లాయ్స్‌‌, టైటానియమ్‌‌ అల్లాయ్స్‌‌,  స్పెషల్‌‌ స్టీల్‌‌ వంటివి చంద్రయాన్ 3 మిషన్ కోసం సప్లయ్ చేసింది. ఈ మెటల్స్‌‌ను లాంచ్ వెహికల్‌‌ తయారీలో వాడారు. బుధవారం 3 శాతం లాభపడిన కంపెనీ షేరు గురువారం 2 శాతం నష్టపోయి రూ.399 దగ్గర ముగిసింది.

5) భెల్‌‌

ప్రభుత్వ రంగ కంపెనీ భెల్‌‌  టైటానియం ట్యాంక్స్‌‌, బ్యాటరీలను చంద్రయాన్ 3 మిషన్ కోసం  సప్లయ్ చేసింది. భెల్‌‌ షేర్లు గురువారం 1.69 శాతం పడి రూ.108 దగ్గర ముగిశాయి.

6) ఎల్ అండ్ టీ

ఎల్‌‌ అండ్‌‌ టీ ఏరోస్పేస్‌‌ బిజినెస్‌‌   కీలకమైన కాంపోనెంట్లను లూనార్ మిషన్ కోసం సప్లయ్ చేసింది. అంతేకాకుండా మాన్యుఫాక్చరింగ్‌‌, బూస్టర్స్ టెస్టింగ్ వంటి అంశాల్లో కూడా పాల్గొంది.  చంద్రయాన్‌‌ 3  లాంచ్ వెహికల్‌‌ను రెడీ చేసింది. ఎల్‌‌ అండ్ టీ షేర్లు గురువారం ఒక శాతం పడి రూ.2,689 దగ్గర ముగిశాయి. 

7) భారత్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌

చంద్రయాన్‌‌ 3 పేలోడ్స్‌‌ తయారీలో కంపెనీ భాగం పంచుకుంది. కంపెనీ షేర్లు గురువారం అర శాతం లాభపడి రూ.134 దగ్గర ముగిశాయి. 

8) సెంటమ్‌‌ ఎలక్ట్రానిక్స్‌‌

ఈ కంపెనీ లూనార్‌‌‌‌ మిషన్‌‌ కోసం ఎలక్ట్రానిక్స్ సిస్టమ్‌‌ను డిజైన్ చేసింది. అంతేకాకుండా తయారు చేసింది. బుధవారం సెషన్‌‌లో 14 శాతం వరకు ర్యాలీ చేసిన కంపెనీ షేర్లు గురువారం ఇంట్రాడేలో  10 శాతం పెరిగాయి. చివరికి 8 శాతం లాభంతో రూ.1,770 దగ్గర సెటిలయ్యాయి.

9) అవంటెల్‌‌

హైదరాబాద్‌‌ కంపెనీ అవంటెల్‌‌  కూడా ఇస్రో కస్టమర్ల లిస్టులో ఉంది. కంపెనీ షేర్లు గురువారం 7 శాతం పెరిగి రూ.252 దగ్గర ముగిశాయి.

10) గోద్రేజ్‌‌ ఇండస్ట్రీస్‌‌

గోద్రేజ్ గ్రూప్ కంపెనీ గోద్రేజ్‌‌ ఏరోస్పేస్‌‌ కీలక విభాగాలను ఇస్రోకి సప్లయ్ చేస్తోంది.  పీఎస్ఎల్‌‌వీ, జీఎస్‌‌ఎల్‌‌వీ   కోసం గత 30 ఏళ్లలో 175 కు పైగా ఇంజిన్లను సప్లయ్ చేసింది. బుధవారం సెషన్‌‌లో కంపెనీ షేర్లు 7 % పెరగగా, గురువారం 0.38 శాతం  లాభంతో రూ.533 దగ్గర క్లోజయ్యాయి. 

ఇన్వెస్టర్లు ఏం చేయాలంటే!

ఈ   కంపెనీల లాంగ్‌‌టెర్మ్‌‌ అవుట్‌‌లుక్ బుల్లిష్‌‌గా ఉందని, చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత ఇవి గ్లోబల్‌‌ స్థాయిలో మెరవడానికి వీలుంటుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ‘గ్లోబల్‌‌ స్పేస్‌‌ మార్కెట్‌‌ 447 బిలియన్ డాలర్లు. ఇందులో ఇండియా వాటా 5 శాతం కంటే తక్కువగా ఉంది. సోలార్ అబ్జర్వేటరీ మిషన్‌‌,  మూన్‌‌ పైకి మనిషిని తీసుకెళ్లే మిషన్లు రెండూ సక్సెస్ అయితే ఇండియా వాటా మరింత పెరుగుతుంది. ఎల్‌‌ అండ్ టీ లాంటి ఇస్రో కస్టమర్లు మరింతగా విస్తరించడానికి వీలుంటుంది.

 అని బ్రోకరేజ్ కంపెనీ సీఎల్‌‌ఎస్‌‌ఏ పేర్కొంది. తాజాగా ర్యాలీ చేసినప్పటికీ కొన్ని స్పేస్‌‌ రిలేటెడ్ కంపెనీల షేర్లు చౌకగానే ఉన్నాయని టీసీజీ ఏఎంసీ ఎనలిస్ట్‌‌ చక్రీ లోకప్రియా అన్నారు. ‘భారత్ ఎలక్ట్రానిక్స్‌‌ తన ప్రొడక్ట్‌‌ల రేంజ్‌‌ను పెంచుతోంది. టెక్నాలజీ అడ్వాన్స్డ్‌‌ కాంపోనెంట్లను తయారు చేస్తోంది. భారత్ ఎలక్ట్రానిక్స్‌‌, ఎంటీఏఆర్‌‌‌‌, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ వంటి కంపెనీలు  కేవలం ఇన్వెస్టర్లను మాత్రమే కాదు స్పేస్‌‌ ఎక్స్‌‌ బిజినెస్‌‌ను కూడా ఆకర్షిస్తాయి’ అని ఆయన వివరించారు. హెచ్‌‌ఏఎల్‌‌,  ఎల్ అండ్ టీ, ఎంటీఏఆర్‌‌‌‌ షేర్లను స్వస్తికా ఇన్వెస్ట్‌‌మార్ట్ టెక్నికల్ ఎనలిస్ట్ సంతోష్ మీనా రికమండ్ చేశారు.