
ఈమధ్య వచ్చిన టీవీ సిరీస్ల్లో షార్క్ ట్యాంక్ ఇండియా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దాంతో ఈ షో రెండో సీజన్ని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దానికి సంబంధించిన ప్రోమోని సోనీ టీవీ ట్విట్టర్లో పెట్టింది. అందులో ఒక ఉద్యోగి తన వెంచర్కు ఇన్వెస్టర్లు కావాలని బాస్ని అడుగుతుంటాడు. బాస్ అతడి మాటల్ని పట్టించుకోడు. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ‘ఇన్వెస్టర్ల కోసం వాళ్లని వీళ్లని ఎందుకు అడగడం. షార్క్ ట్యాంక్ ఇండియా రెండో సీజన్ వచ్చేస్తుంది’ అని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ప్రోమోలో ‘షార్క్స్’ అష్నీర్ గ్రోవర్, అనుపమ్ మిట్టల్, అమన్ గుప్తా, వినీతా సింగ్, నమితా థాపర్లు ఈ షోలో దాదాపు 42 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం చూపించారు. ఈ షోలో పార్టిసిపేట్ చేయాలం టే సోని లైవ్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.