
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 28 న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం లోటస్ పాండ్లో పార్టీ జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ ఇన్చార్జ్లు, అనుబంధ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో పాదయాత్రపై చర్చించారు. షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి కామెంట్లను దేవేందర్ ఖండించారు. పంచె కట్టినంత మాత్రాన నిరంజన్ రెడ్డి రైతు కాదని ఎద్దేవా చేశారు. త్యాగాల కుటుంబం వైఎస్సార్ది అయితే, బోగాల కుటుంబం కేసీఆర్ది అని ఆరోపించారు. వైఎస్సార్ అన్న మాటలు టీఆర్ఎస్ నేతలు వక్రీకరించారని, కేసీఆర్ కుటుంబం నుంచి వీసా తీసుకొని రావాలా అని వైఎస్ అన్నారని గుర్తుచేశారు.