మెహులీ ఘోష్​​కు పారిస్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌

మెహులీ ఘోష్​​కు పారిస్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌

బాకు (అజర్‌‌‌‌‌‌‌‌బైజాన్‌‌‌‌‌‌‌‌): ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌ మెహులీ ఘోష్‌‌‌‌‌‌‌‌.. ఐఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టింది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన ఆమె.. 2024 పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో మెహులీ 229.8 పాయింట్లు నెగ్గి మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది. చైనా షూటర్లు జియాయు హన్‌‌‌‌‌‌‌‌, జిహ్లిన్‌‌‌‌‌‌‌‌ హంగ్‌‌‌‌‌‌‌‌ వరుసగా గోల్డ్‌‌‌‌‌‌‌‌, సిల్వర్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. ఇండియాకే చెందిన తిలోత్తమ సేన్‌‌‌‌‌‌‌‌ 208.4 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. షూటింగ్‌‌‌‌‌‌‌‌లో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ బెర్త్‌‌‌‌‌‌‌‌ దక్కించుకున్న నాలుగో షూటర్‌‌‌‌‌‌‌‌ మెహులీ. భవనీష్‌‌‌‌‌‌‌‌ (మెన్స్‌‌‌‌‌‌‌‌ ట్రాప్‌‌‌‌‌‌‌‌), రుద్రాంక్ష్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌ (మెన్స్‌‌‌‌‌‌‌‌ 10 మీ. ఎయిర్‌‌‌‌‌‌‌‌ రైఫిల్‌‌‌‌‌‌‌‌), స్వప్నిల్‌‌‌‌‌‌‌‌ (మెన్స్‌‌‌‌‌‌‌‌ 50మీ. రైఫిల్‌‌‌‌‌‌‌‌ 3 పొజిషన్‌‌‌‌‌‌‌‌) ముందున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో మెహులీ–తిలోత్తమ–రమిత త్రయం 1895.9 పాయింట్లతో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకుంది.