
ముంబై: టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. IPL టైటిల్ చేజారిన 10 రోజుల్లోనే అయ్యర్కు మరో ట్రోఫీ దూరమైంది. ముంబై T20 లీగ్లో అయ్యర్ కెప్టెన్గా వ్యవహారిస్తోన్న సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు ఫైనల్ పోరులో ఓటమి పాలైంది. ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ జట్టు సోబో ముంబై ఫాల్కన్స్ను ఓడించి T20 ముంబై లీగ్ 2025 ఛాంపియన్గా నిలిచింది.
ఐపీఎల్లో అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ ఫైనల్ మ్యాచులో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలై టైటిల్ కోల్పోయిన విషయం తెలిసిందే. 10 రోజుల వ్యవధిలోనే అటు ఐపీఎల్ ట్రోఫీ, ఇటు ముంబై T20 టైటిల్ను అయ్యర్ కోల్పోయాడు. దీంతో 10 రోజుల్లోనే రెండు సార్లు టైటిల్ ముద్దాడే అదృష్టాన్ని ఒక్క అడుగు దూరంలో కోల్పోయాడు అయ్యర్.
ముంబై టీ20 లీగ్ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. అయ్యర్ నేతృత్వంలోని సోబో ముంబై ఫాల్కన్స్ జట్టు లీగ్లో అద్భుతంగా ఆడి ఫైనల్కు చేరుకుంది. జట్టులో అయ్యర్తో పాటు ఐపీఎల్ స్టార్ అంగ్క్రిష్ రఘువంశీ ఉండటంతో ఫైనల్ పోరులో ముంబై ఫాల్కన్స్ టీమే హాట్ ఫేవరెట్.
ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్, సోబో ముంబై ఫాల్కన్స్ జట్ల మధ్య 2025, జూన్ 12న ఫైనల్ మ్యాచ్ జరిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అయ్యర్ జట్టు కీలకమైన ఫైనల్లో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ ఫైనల్లో ముంబై ఫాల్కన్స్ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలించింది.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ జట్టుకు పేలవమైన ఆరంభం దక్కింది. రఘువంశీ 12 బంతుల్లో కేవలం ఏడు పరుగులు చేయగా, అయ్యర్ 17 బంతుల్లో 12 పరుగులే చేసి నిరాశ పర్చారు. చివర్లో మయూరేష్ టాండెల్ 50, హర్ష్ అఘవ్ 45 పరుగులతో రాణించడంతో ముంబై ఫాల్కన్స్ 157 పరుగుల స్కోర్ చేసింది.
వైభవ్ మాలి 2, ఆదిత్య ధుమల్, మాక్స్వెల్ స్వామినాథన్ తలా ఒక వికెట్ తీశారు. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్ బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. సాహిల్ భగవంత జాదవ్ 22, చిన్మయ్ రాజేష్ సుతార్ 53, అవాయిస్ ఖాన్ నౌషాద్ 38 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.