
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు సెక్రటరీగా శృతి ఓజా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా పనిచేసిన ఆమె.. ఇటీవల ఇంటర్ బోర్డుకు బదిలీ అయ్యారు. ఆమె తొలిరోజు ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించారు. కాగా, బాధ్యతలు స్వీకరించిన శృతి ఓజాను ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో టీజేఎల్ఏ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.