భారీగా నగదు పట్టివేత

భారీగా నగదు పట్టివేత

నవాబుపేట, వెలుగు: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన లంబ గోపాల్  వద్ద ఉన్న రూ.4.90 లక్షలు సీజ్​ చేసినట్లు ఎస్ఐ పురుషోత్తం తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్​ చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, గోపాల్​ తీసుకెళ్తున్న నగదును గుర్తించారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

పెబ్బేరు: మండలంలోని రంగాపూర్​ చెక్​పోస్ట్​ వద్ద కారులో తీసుకెళ్తున్న రూ.4 లక్షలను పోలీసులు పట్టుకున్నట్లు ఎస్ఐ జగదీశ్వర్​రెడ్డి తెలిపారు. ఏపీలోని​కర్నూల్​ జిల్లా గుంతకల్​ ప్రాంతానికి చెందిన గోదా రంగనాథ రామానుజ కూటమి ఛారిటబుల్​ ట్రస్ట్​కు చెందిన పెరుమాల బాలసుధాకర్​ తదితరులు గుంతకల్​ నుంచి మధురకు వెళ్లేందుకు 170 మందికి ట్రైన్​ టికెట్ల బుకింగ్​ కోసం హైదరాబాద్​కు వెళ్తున్నారు. రంగాపూర్​ వద్ద ఎస్ఎస్టీ​టీమ్, పోలీసులు తనిఖీ చేయగా, రూ.4 లక్షలు దొరికాయి. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో అమౌంట్​ను సీజ్​ చేసినట్లు ఎస్ఐ చెప్పారు. 

చిన్న చింతకుంట: కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన రాజ్యసభ అనే వ్యక్తి వద్ద ఉన్న రూ1.02 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఆర్​ శేఖర్​ తెలిపారు. లాల్కోట చౌరస్తా చెక్​పోస్ట్ లో తనిఖీ చేయగా, ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదు దొరికిందని చెప్పారు. నగదుతో పాటు అశోక్  లేలాండ్  వెహికల్​ను సీజ్​ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ALS0 READ: సీన్లో దమ్ము లేకపోతే నేనేం చేయాలి