
న్యూఢిల్లీ: యుటిలిటీ మోడళ్లకు బలమైన డిమాండ్ నేపథ్యంలో మనదేశంలో ప్యాసింజర్స్ వెహికల్స్ హోల్సేల్ అమ్మకాలు ఆగస్టులో 9 శాతం పెరిగాయని సియామ్ సోమవారం తెలిపింది. 2022 ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్స్కు 3,28,376 వెహికల్స్ వెళ్లగా, ఈసారి 3,59,228 వెహికల్స్ వెళ్లాయి. యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి 1,81,825 వెహికల్స్కు చేరుకున్నాయి. ప్యాసింజర్ కార్ల డిస్పాచ్లు ఆగస్ట్ 2022లో 1,33,477 వెహికల్స్ నుంచి 10 శాతం క్షీణించి 1,20,031 వెహికల్స్కు తగ్గాయి. వ్యాన్ హోల్సేల్స్ కూడా 12,236 వెహికల్స్ నుంచి 11,859 వెహికల్స్కు పడిపోయాయి.
ప్యాసింజర్ వెహికల్స్, త్రీ-వీలర్స్ గత నెల విపరీతంగా అమ్ముడయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) అధ్యక్షుడు వినోద్ అగర్వాల్ తెలిపారు. త్రీవీలర్ విక్రయాలు ఆగస్టులో 64,763 వెహికల్స్కు పెరిగాయి. గత ఏడాది ఇదే నెలలో 38,369 వెహికల్స్ డిస్పాచ్ అయ్యాయి. టూవీలర్ డిస్పాచ్లు 15,57,429 వెహికల్స్ నుంచి 15,66,594 వెహికల్స్కు పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో, మారుతీ సుజుకి ఇండియా 16 శాతం వృద్ధిని సాధించింది. దీని అమ్మకాలు ఆగస్టు 2022లో 1,34,166 వెహికల్స్ నుంచి 1,56,114 వెహికల్స్కు చేరుకున్నాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా డీలర్లకు 53,830 వెహికల్స్ను పంపింది..