
యాదాద్రి, వెలుగు: మూడు నెలలలోపు గర్భిణీలకు 'సికిల్ సెల్ అనీమియా' స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలని డీఎంహెచ్వో మనోహర్ సూచించారు. గర్భిణీల బ్లడ్ శాంపిల్స్ సేకరించి టీ హబ్లో టెస్ట్లు నిర్వహించి, రిపోర్టులను 'బ్లడ్ సెల్ పోర్టల్'లో అప్లోడ్ చేయాలన్నారు.
ఆఫీసులో నిర్వహించిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాలేయ సంబంధిత వ్యాధులను అరికట్టే హెపటైటిస్ బి వ్యాక్సిన్ను మూడు డోసుల్లో వేయాలన్నారు. స్వస్థ నారీ అభియాన్లో భాగంగా పీహెచ్సీ, సీహెచ్సీ, పల్లె దవాఖానల్లో శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు యశోధ, సాయి శోభ, డాక్టర్లు కే మధురిమ, స్వప్న రాథోడ్, సృజన, సందీప్ రెడ్డి ఉన్నారు.