సిద్దిపేట డివిజన్ పరిధిలో 43 ఫోన్లు అప్పగింత : ఏసీపీ రవీందర్రెడ్డి

సిద్దిపేట డివిజన్ పరిధిలో 43 ఫోన్లు అప్పగింత :  ఏసీపీ రవీందర్రెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట డివిజన్ పరిధిలో పోయిన, చోరీకి గురైన 43 ఫోన్లను రికవరీ చేసినట్లు ఏసీపీ రవీందర్​రెడ్డి తెలిపారు. బుధవారం వాటిని బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్​లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.