
అంటాల్యా: ఇండియా మెన్స్ రిక్వర్ టీమ్.. వరల్డ్ కప్ స్టేజ్–1లో సిల్వర్ మెడల్ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్దీప్ రాయ్–అటాన్ దాస్–ధీరజ్ బొమ్మదేవరతో కూడిన ఇండియా త్రయం షూటాఫ్లో 4–5 (54–55, 50–56, 59–58, 56–55, 28–28*)తో లీ జొంగుయాన్–క్వి జియాంగ్షువో–వీ షాహోజు (చైనా) చేతిలో ఓడి రెండో ప్లేస్లో నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇండియా 0-–4తో వెనుకబడ్డా కీలక టైమ్లో పుంజుకుని స్కోరును సమం చేసింది. అయితే షూటాఫ్లో మాత్రం ఇండియన్ ఆర్చర్లు ఫెయిలయ్యారు. ఇండివిడ్యువల్ కేటగిరీలో ధీరజ్ 7–3 (28–-28, 29–-26, 28–-29, 29–-27, 29–-27) తో ఇల్ఫత్ అబ్దులిన్ (కజకిస్తాన్)పై నెగ్గి బ్రాంజ్ మెడల్ను సొంతం చేసుకున్నాడు. ఈ వరల్డ్కప్లో ధీరజ్కు ఇది రెండో మెడల్. ఓవరాల్గా ఇండియా రెండు గోల్డ్, ఓ సిల్వర్, ఓ బ్రాంజ్ మెడల్తో ఈ టోర్నీని ముగించింది.