BWF వరల్డ్ టూర్ ఫైనల్లోకి పీవీ సింధు

BWF వరల్డ్ టూర్ ఫైనల్లోకి పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు BWF వరల్డ్ టూర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం  బాలీలో జరిగిన సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై విజయం సాధించింది. ఒక గంట 10 నిమిషాలపాటు సాగిన  సెమీస్ మ్యాచ్‌లో 21–-15, 15-–21, 21–-19 తేడా తో యమగుచిని ఓడించింది.  ఆదివారం జరిగే ఫైనల్ పోరులో దక్షిణ  కొరియాకు చెందిన ప్లేయర్  యాన్ సెయోంగ్‌తో సింధు తలపడనుంది.