ఇండోనేషియా క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు

ఇండోనేషియా క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు

ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ 1000 టోర్నీలో డ‌బుల్ ఒలింపిక్ ప‌త‌క విజేత‌... హైద‌రాబాదీ పీవీ సింధు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో చేరుకుంది. గురువారం జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్ పోరులో సింధు జ‌ర్మ‌నీకి చెందిన‌ ప్ర‌త్య‌ర్థి యొన్నెలీపై 21-12, 21-18 తేడాతో విజ‌యం సాధించింది. 37 నిమిషాల‌పాటు జ‌రిగిన మ్యాచ్ లో సింధు వ‌రుస సెట్ల‌లో విక్టరీ సాధించింది. రెండో రౌండ్ లో స్పానియ‌ర్డ్ బిట్రిజ్‌-సిమ్ యుజిన్ మ‌ధ్య మ్యాచ్ జరగనుంది. అందులో గెలిచిన  విజేతతో..విమెన్స్ సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు తలపడనుంది.