సింగరేణి ఆధ్వర్యంలో 5.47 లక్షల మొక్కలు నాటాం : సింగరేణి సీఎండీ ఎన్. బలరాం

సింగరేణి ఆధ్వర్యంలో 5.47 లక్షల మొక్కలు నాటాం : సింగరేణి సీఎండీ ఎన్. బలరాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 15,231హెక్టార్లలో 5.47 లక్షల మొక్కలను నాటామని కంపెనీ చైర్మన్​ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ఎన్​. బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెంలోని బంగ్లోస్​ ఏరియాలో సోమవారం స్వయంలో ఆయన 204 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 675 హెక్టార్లలో 40 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

 ఓబీ డంప్​ల ప్రాంతంతో పాటు మైన్స్​ల ఆవరణలో మొక్కలను పెంచుతున్నామన్నారు. ఈ ప్రోగ్రాంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ, ఎల్వీ సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, జీఎంలు ఎ. మనోహర్​, సైదులు, ఎన్​.రాధాకృష్ణ, ఎ. రవి కుమార్​, ఎలిషా పాల్గొన్నారు.