సింగరేణి సీఎంఓ పోస్టు రద్దు

సింగరేణి సీఎంఓ పోస్టు రద్దు
  • కాంట్రాక్ట్​ పద్ధతిలో  మెడికల్  సర్వీసెస్ చీఫ్  నియామకానికి  నోటిఫికేషన్ 
  • సీఎంఓఏఐ ప్రతినిధుల అభ్యంతరం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్​కంపెనీలో కీలకమైన చీఫ్​మెడికల్​ఆఫీసర్​(సీఎంఓ) పోస్టు ఈ నెలతో రద్దు కానుంది. సింగరేణి కోల్​మైన్స్​వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్, డిస్పెన్సరీలను పర్యవేక్షించే సీఎంఓ పోస్టును  ఇక మీదట కాంట్రాక్ట్​ పద్ధతిలో మెడికల్​ సర్వీసెస్​చీఫ్ ​ పేరిట అధికారిని నియమించనున్నారు.  చాలాకాలంగా తాము పర్మినెంట్​ డాక్టర్లుగా  పని చేస్తున్నామని, తమపై కొత్తగా వచ్చిన కాంట్రాక్ట్​ అధికారి పెత్తనం చేయడమేంటని సీనియర్​డాక్టర్లు మండిపడుతున్నారు.

3ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  కోల్​మైన్స్​ ఆఫీసర్స్​అసోసియేషన్​ఆఫ్​ఇండియా (సీఎంఓఏఐ) మేనేజ్ మెంట్​కు  వినతిపత్రం ఇచ్చింది.   కంపెనీ హాస్పిటల్స్​లో సీనియర్​ డాక్టర్లను ప్రతి రెండు, మూడేండ్లకోసారి ప్రమోషన్ల ద్వారా యాజమాన్యం భర్తీ చేస్తుంది. సీఎంఓ పోస్టు రద్దయితే  ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని  డాక్టర్లు పేర్కొంటున్నారు.  మెడికల్​ సర్వీసెస్​ చీఫ్​గా నియమించే అధికారి  రెండేండ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈనెల10న యాజమాన్యం నోటిఫికేషన్​రిలీజ్​చేసింది.

  ఇందులో సీఎంఓ స్థానంలో చీఫ్​మెడికల్​సర్వీసెస్​పోస్టు సృష్టించి, అడ్మినిస్ట్రేషన్​అప్పగించేలా యాజమాన్యం అందులో పేర్కొంది. దీనిపై  కోల్​మైన్స్​ ఆఫీసర్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సింగరేణి బ్రాంచ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లో జీఎం సీపీపీ మనోహర్​కు వినతిపత్రాన్ని ఇచ్చారు.  సీఎంఓఏఐ ప్రతినిధులు ఎస్​. వెంకటాచారి, కేశవరావు, రాజీవ్ కుమార్,  రాజగోపాల్​, సునీల, మాలతి, సునీల్​వర్మ పాల్గొన్నారు. న్నారు.