పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలి : సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్లు

పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలి : సింగరేణి కోల్మైన్స్ పెన్షనర్లు

కోల్​బెల్ట్, వెలుగు: తమకు రూ.30 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్​చేస్తూ సింగరేణి కోల్​మైన్స్​ పెన్షనర్లు సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ఐబీలోని​ యూనియన్ ​బ్యాంక్​ ఎదుట ధర్నా చేపట్టారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. 

బ్యాంకులో ఖాతాలున్న 70ఏళ్ల లోపు  కోల్​మైన్స్​ పెన్షనర్లకు రూ.30లక్షల ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10లక్షల ఇన్సురెన్స్​ సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు. బ్యాంక్ మేనేజర్ నిశంత్ కు వినతిపత్రం అందజేశారు.