మందమర్రి పట్టణంలో అగ్ని ప్రమాదంలో సింగరేణి కార్మికుడి ఇల్లు దగ్ధం

మందమర్రి పట్టణంలో  అగ్ని ప్రమాదంలో సింగరేణి కార్మికుడి ఇల్లు దగ్ధం
  •     రూ.8 లక్షల ఆస్తి నష్టం

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో ఓ సింగరేణి కార్మికుడి ఇల్లు దగ్ధమైంది.  శ్రీపతినగర్​కు చెందిన కార్మికుడు తుమ్మ సదానందం ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్లగా ఆయన భార్య రమణి, అత్త బొందమ్మ ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉన్నారు. అయితే ఇంట్లో ఒక్కసారిగా మంటలు రేగడంతో అప్రమత్తమైన ఇద్దరు బయటకు పరుగులు తీశారు. 

చుట్టుపక్కల వారు, ఫైర్​ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు సదానందం వాపోయాడు. షార్ట్ సర్క్యూట్ ​కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై గోపతి నరేశ్​ పరిశీలించి వివరాలు సేకరించారు.