
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్లను సాధించిపెట్టిన ఘనత కార్మిక నేత మనుబోతుల కొమురయ్యకు దక్కుతుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ, బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ అన్నారు. మందమర్రి, శ్రీరాంపూర్ఏరియా బొగ్గు గనులు, డిపార్ట్మెంట్లపై దివంగత కార్మిక నేత కొమురయ్య 29వ వర్ధంతి వేడుకలను శుక్రవారం కార్మికుల సమక్షంలో జరిపారు. కొమురయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా లీడర్లు మాట్లాడుతూ..1942 మే 1న సీపీఐ అనుబంధ సింగరేణి కాలరీస్వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) స్థాపించిన వారిలో కొమురయ్య ఒకరన్నారు.
సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు పెన్షన్విధానం తీసుకురావడం, సంస్థ బీఐఎఫ్ఆర్వల్ల నష్టాల బాటలో వెళ్లినప్పుడు కాపాడడంతో ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన జీవితకాలం కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమించారని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, వైస్ ప్రెసిడెంట్లు భీమనాథుని సుదర్శనం, ఇప్పకాయల లింగయ్య, వెంకటస్వామి, జాయింట్సెక్రటరీ కంది శ్రీనివాస్, పిట్సెక్రటరీలు హరిరామకృష్ణ, మార్రి కుమారస్వామి, ప్రేమ్ లాల్, పి.రాజేశం, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.