33వేలు దాటిన కరోనా మరణాలు

33వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది.  కరోనా దాటికి ఇండియాలో 33  వేల మందికి పైగా చనిపోయారు.  గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47,704 కరోనా కేసులు నమోదవ్వగా 654 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య  14,83,157 కు చేరింది. ఇందులో 4,96,988 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా..9,52,744 మంది డిశ్చార్జ్ అయ్యారు.33,425 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా ఒక్కరోజే ( జులై 27న) 5,28,082 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో జూలై27 నాటికి దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య 1,73,34,885 చేరింది.  ఇక దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 64.23 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

see more news