
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకెళుతోంది. IAS ,IPS అధికారుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో SIB రివ్యూ కమిటీ ప్యానల్ను తప్పుదోవ పట్టించిందని మాజీ సీఎస్ శాంతి కుమారి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కోసం SIB పంపిన నంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మాజీ సీఎస్ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. GAD జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు.
సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న సమయంలో ట్యాపింగ్ జరిగినట్లు సిట్ బృందం గుర్తించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి ఫోన్స్ ట్యాప్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిళ్ళ సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసింది.
గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సహా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందించే ఫోన్ నెంబర్స్ను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబీ టీమ్ ట్యాపింగ్ చేసేది. సంబంధింత వ్యక్తుల వ్యక్తిగత, కుటుంబ, అనుచరుల వివరాలు, వ్యాపార లావాదేవీలను సేకరించేది.
►ALSO READ | ముహూర్తం టైంకు వధువు జంప్.. వద్దన్నా వినకుండా మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.. పాపం చివరికి..
ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్ లీడర్ల ఫోన్ నెంబర్స్తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఇందులో ప్రణీత్రావుతో కలిసి పని చేసిన కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్ ద్వారా రికార్డ్ చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు సిట్ ఆధారాలు సేకరించింది.