ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత తాళం వేసిన ఆరు ఇండ్లల్లో చోరీ జరిగింది. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ వివరాల ప్రకారం.. హుస్నాబాద్ గల్లీలో పాల గంగాధర్ తనకు చెందిన ఓ పోర్షన్కు తాళాలు వేసి మరో పోర్షన్ లో పడుకున్నారు. దొంగలు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువాలోని 9 తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి చోరీ చేశారు.
ఔట్ గల్లీలో ఒక కిరాణా షాపులో నుంచి కిరాణ సామగ్రి ఎత్తుకెళ్లారు. మరో నాలుగు ఇండ్ల తాళాలు పగులగొట్టినప్పటికీ అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వోతెలిపారు.
