అమెరికా హ్యాండ్లూమ్రీసెర్చ్ స్కాలర్ కైరా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతమని అమెరికాకు చెందిన హ్యాండ్లూమ్, టెక్స్టైల్ రీసెర్చ్ స్కాలర్ కైరా జాప్ గాబ్రియేల్ అన్నారు. పోచంపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, నారాయణపేట, గద్వాలలోని చేనేత స్థితిగతులపై స్టడీ చేసిన ఆమె.. బుధవారం మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. తాను 9దేశాల్లో పర్యటించానని..ఎక్కడా లేని టాలెంట్ తెలంగాణ నేత కార్మికులకు సొంతమని మంత్రికి తెలిపారు. రాష్ట్ర చేనేతలు కొత్త టెక్నిక్లతో బట్టలు నేయడం వల్లే ప్రపంచ మార్కెట్లో గొప్ప విలువ ఉందని చెప్పారు. ఒకే చోట వందలాది మంది పనిచేస్తూ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారని.. దాని వల్ల మార్కెటింగుకు మంచి అవకాశం ఉంటుందని వివరించారు.
చేనేతకు ఇన్నోవేషన్, టెక్నాలజీని జోడిస్తే భవిష్యత్తరాలకు కూడా ఉపయోగపడుతుందని కోరారు. కాగా, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కైరా వంటి రీసెర్చ్స్కాలర్ల సలహాలు స్వీకరిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. విదేశాల్లో చేనేత పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటామని వెల్లడించారు. నేత కార్మికుల కోసం తమ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నదని వివరించారు. రాష్ట్ర సర్కారు తీసుకుంటోన్న చర్యల వల్లే నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని కేటీఆర్ పేర్కొన్నారు.