
హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ గ్రిడ్ పరుపులు, దిండ్లు, చెయిర్లు తయారు చేసే ‘స్లీప్ కంపెనీ’ సిటీలో మొదటిస్టోర్ను కొండాపూర్లో శుక్రవారం ఓపెన్ చేసింది. ఈ సందర్భంగా కంపెనీ కో–ఫౌండర్ హర్షిల్ సలోట్ మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 25కు పైగా స్టోర్స్ను మొదలుపెడతామని చెప్పారు. తమ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీకి పేటెంట్ ఉందని, ఈ పరుపులు అద్భుతమైన నిద్ర అనుభవాన్ని ఇస్తాయని చెప్పారు.
గడిచిన రెండేళ్లలో నాలుగు రెట్ల గ్రోత్ సాధించామని, రాబోయే రెండేళ్లలో రూ.500 కోట్ల ఆదాయాన్ని టార్గెట్గా పెట్టుకున్నట్టు చెప్పారు. తమ ఆదాయంలో 45 శాతం వరకు దక్షిణాది మార్కెట్ నుంచే వస్తున్నదని అన్నారు. తమ పరుపుల ధరలు రూ.18 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటాయని చెప్పారు. తయారీ యూనిట్ ముంబైలో ఉందని సలోట్ వివరించారు. కంపెనీ ఇప్పటి వరకూ ఫైర్ సైడ్ వెంచర్స్ ద్వారా రూ.13.4 కోట్ల మేరకు నిధులు పొందింది.