
కొత్తగూడ,వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోలారం తండాకు చెందిన బానోత్ చక్రు(45) పాముకాటుతో చనిపోయాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా కాలిపై తాచుపాము కాటు వేసింది. దీంతో పక్కనే ఉన్న రైతులకు విషయం చెప్పాడు. వారు ఆయనను హాస్పిటల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు.