ఆ శరీర భాగాలు శ్రద్ధా వాకర్వే.. ఢిల్లీ పోలీసుల నిర్ధారణ

ఆ శరీర భాగాలు  శ్రద్ధా వాకర్వే.. ఢిల్లీ పోలీసుల నిర్ధారణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఢిల్లీ సమీపంలో స్వాధీనం చేసుకున్న శరీర భాగాలు శ్రద్దావాకర్ వేనని నిర్ధారణ అయ్యింది. ఆమె తండ్రి నుంచి సేకరించిన DNA నమూనాతో అవి మ్యాచ్ అయినట్లు పోలీసులు నిర్ధారించారు. వివిధ ప్రాంతాల్లో లభించిన ఎముకల డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది. అవి శ్రద్ధా వాకర్ తండ్రి డీఎన్ఏతో సరిపోలాయని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది.

శ్రద్దావాకర్ హత్య కేసులో వాస్తవాలను ధృవీకరించేందుకు ఢిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నిందితుడు ఆఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ తో పాటు నార్కో పరీక్షలు చేశారు. శ్రద్దావాకర్ శరీరభాగాలను 35 భాగాలుగా నరికి పారేయగా...ఇప్పటి వరకు 13 భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.