ఆదిలాబాద్ లో రియల్ మాఫియా.. ఈడీ స్వాధీనంలో ఉన్నా వదల్లేదు.. కోట్ల విలువైన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్

ఆదిలాబాద్ లో రియల్ మాఫియా.. ఈడీ స్వాధీనంలో ఉన్నా వదల్లేదు.. కోట్ల విలువైన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్

ఆదిలాబాద్​జిల్లాలో రియల్​ మాఫియా పడగ విప్పింది. వివాదంలో ఉండి ఈడీ స్వాధీనం చేసుకున్న భూమిని కూడా వదల్లేదు. కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది రియల్ ఎస్టేట్​ ముఠా. ఈ భారీ భూకుంభకోణంగా స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. 

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ఈసీ స్వాధీనంలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్​చేయించుకున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ భూమి ఎస్ బీఐ మార్ట్​ గేజ్​ లో కూడా ఉంది. అయినప్పటికీ రమేష్​శర్మ, మామ్లా శేఠ్​లు మరికొంత మందితో కలిసి ముఠాగా ఏర్పడి భూమిని అక్రమంగా కొల్లగొట్టారు. 

విషయం బయటికి రావడంతో 10మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు రమేష్​ శర్మ, మామ్లా శేఠ్​ ను అరెస్ట్ చేశారు పోలీసులు.