ఏపీ సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

ఏపీ సీఎం జగన్ తో సోమేశ్ కుమార్ భేటీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో  తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు.తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు గంట సేపు జగన్ తో భేటీ అయ్యారు.  సోమేశ్ కుమార్ తో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఉన్నారు. 

అంతకుముందు విజయవాడ ఎయిర్ పోర్ట్ లో మాట్లాడిన సోమేశ్ కుమార్.. ప్రభుత్వ అధికారిగా ఏపీ ప్రభుత్వం తనకు  ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని అన్నారు.. డీవోపీటీ అదేశాల మేరకే తాను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేస్తానని చెప్పారు. 

సోమేశ్ కుమార్కు ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణకు సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేసిన ధర్మాసనం.. సర్టిఫైడ్ కాపీ అందిన వెంటనే ఏపీకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం  ఏపీకి కేటాయించింది. అయితే కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో 2016లో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగేలా హైదరాబాద్ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.  క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే కొనసాగుతూ వచ్చారు.