త్వరలోనే ట్విట్టర్ పిట్టలు ఎగిరిపోనున్నాయ్

త్వరలోనే ట్విట్టర్ పిట్టలు ఎగిరిపోనున్నాయ్

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ మరో కొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఉన్న ట్విట్టర్ లోగో పిట్ట గుర్తును చేంజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ‘‘త్వరలోనే మేం ట్విట్టర్‌ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి పోస్టు చేసిన X లోగో బాగుంటే.. రేపటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా లైవ్‌లోకి వస్తుంది” అంటూ మస్క్ వరుస ట్వీట్లు చేసి అందర్నీ షాక్ కు గురిచేశారు. దాంతో పాటు ట్విట్టర్ కలర్‌‌ను డీఫాల్ట్‌గా బ్లాక్‌గా మారుస్తామని కూడా పేర్కొన్నారు.

ఇక మరోవైపు ట్విట్టర్‌లోని అన్‌ వెరిఫైడ్‌ ఖాతాల నుంచి డైరెక్ట్ మెసేజ్‌లపైనా కీలక నిర్ణయం తీసుకున్న మస్క్.. వాటిని పరిమితం చేస్తున్నట్లు జూలై 22న ప్రకటించారు. డైరెక్ట్‌ మెసేజ్‌ల స్పామ్‌ను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, అందులో భాగంగానే అన్‌వెరిఫైడ్‌ ఖాతాల నుంచి భవిష్యత్తులో పరిమిత సంఖ్యలోనే డీఎం (డైరెక్ట్‌ మెసేజ్‌)లు చేయగలరని చెప్పారు. అందుకోసం సబ్ స్క్రైబ్‌ చేసుకొని ఎక్కువ మెసేజ్‌లు పంపండి అంటూ మస్క్ ఇటీవల స్పష్టం చేశారు.

 

And soon we shall bid adieu to the twitter brand and, gradually, all the birds

— Elon Musk (@elonmusk) July 23, 2023