సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జనవరి 1 నుంచి 20 వరకు వివిధ స్టేషన్ల మధ్య 94 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ రైళ్లలో రిజర్వేషన్ కోచ్ లతో పాటు జనరల్ బోగీలు కూడా ఉంటాయి. మచిలీపట్నం – కర్నూలు సిటీ, కాకినాడ టౌన్ – లింగంపల్లి, మచిలీపట్నం – తిరుపతి, విజయవాడ – నాగర్ సోల్, తిరుపతి – పూర్ణ సహా పలు ప్రత్యేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.